భర్త మృతిపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
మన్యం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామానికి చెందిన గొర్లె భారతి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్టీ ఛైర్మన్ను ఆశ్రయించింది. శనివారం విజయనగరంలోని కమిషన్ ఛైర్మన్ శంకర్రావును కలిసి వినతిపత్రం అందించారు. తన భర్త భీముడు అనుమానస్పద మృతికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
అధికారులతో మాట్లాడతానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.