logo

పాఠశాలకు వెళ్ళమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నా

మా పాఠశాల నుండి వేరే పాఠశాలకు వెళ్ళమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నా చేశారు. చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలం వెంగమాంబ పురం ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను ఆదిలక్ష్మి పురంలోని ఉన్నత పాఠశాలకు విద్యాశాఖ అధికారులు మ్యాపింగ్ చేయడంతో విద్యార్థులను అక్కడికి వెళ్లాలని సూచించారు. కానీ వెంగమాంబ పురం నుండి ఆదిలక్ష్మి పురానికి వెళ్లాలంటే హైవే రోడ్డు కావడంతో బస్సులు కారులు ట్రాక్టర్లు భారీ కంటైనర్లు అటువైపుగా వెళుతూ విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంగమాంబ పురంలోని పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఇక్కడ 25 మంది విద్యార్థులు ఉన్నారని, ఆదిలక్ష్మిపురంలో కేవలం 5 మంది విద్యార్థులే ఉన్నారని... వీలైతే వాళ్లని వెంగమాంబ పురానికి మ్యాపింగ్ చేయాలని కోరుతూ ఎంఈఓ 2 గణపతికి వినతిపత్రం సమర్పించారు

2
829 views