logo

విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలల కమిషన్ దందా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

కొన్ని ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు విద్యాశాఖ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతున్నాయి. విద్యార్థుల‌కు కావాల్సిన పుస్త‌కాలు, యూనిఫామ్స్, ఇత‌ర విద్యాసామాగ్రిని త‌మ వ‌ద్దే కొనాలంటూ.. వాటిని అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ.. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు

విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలల కమిషన్ దందా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
కొన్ని ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు విద్యాశాఖ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతున్నాయి. విద్యార్థుల‌కు కావాల్సిన పుస్త‌కాలు, యూనిఫామ్స్, ఇత‌ర విద్యాసామాగ్రిని త‌మ వ‌ద్దే కొనాలంటూ.. వాటిని అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ.. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు భారం మోపుతున్నారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల క‌మిష‌న్ దందా ప‌ట్ల‌ విద్యాశాఖ అధికారులు చూసీ చూడ‌నట్లు వ్య‌వ‌హ‌

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ విక్రయిస్తూ విద్యార్థుల నుండి వేల రూపాయలు దోచుకుంటున్నారు. కేవ‌లం పాఠ్య పుస్త‌కాల కోసం 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల వ‌ద్ద‌ రూ. 6937 చొప్పున‌, ఆరో త‌ర‌గ‌తి విద్యార్థుల వ‌ద్ద రూ. 5164 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. ఇవి బ‌హిరంగ మార్కెట్లో అయితే కేవ‌లం రూ. 2200 లోపే వ‌స్తున్నాయి. స్కూల్ ఫీజులు కూడా య‌ధేచ్చ‌గా వ‌సూలు చేస్తూ దందాల‌కు పాల్ప‌డుతున్నారు.

Books Schools1

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..

రాష్ట్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాలలో స్టేషనరీ, నోట్ బుక్స్, యూనిఫామ్ లు వంటివి పాఠశాలలో విక్రయించరాదు. తల్లిదండ్రులకు దుకాణాలను మాత్రమే సిఫారసు చేయాలి, అప్పుడు తల్లిదండ్రులు వారికి ఇష్టం వచ్చిన దుకాణాలలో పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయొచ్చు. కానీ నేడు ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పుస్తకాలను విక్రయించే వారితో ఒప్పందం చేసుకొని వారి నుండి నేరుగా విద్యార్థులకు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలు తమ ఆవరణలో కాకుండా బయట ప్రదేశాలలో రూములు కిరాయి తీసుకుని విక్రయాలను కొనసాగిస్తున్నారు. దుకాణాల ద్వారా విక్రయించడం వలన భారీ మొత్తంలో పాఠశాలల యజమానులు లాభాలను పొందుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాములు, స్టేషనరీ అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు చేయబడుతుందని ప్రభుత్వం హెచ్చరించిన ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..

ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల క‌మిష‌న్ దందాల విష‌యంలో ప్ర‌భుత్వ అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారుల తీరుపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక ధ‌ర‌ల‌కు పుస్త‌కాలు విక్ర‌యిస్తున్న‌ ప్రైవేటు పాఠశాలల‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు



Tottada Srinivas. Scholl psychologist. And. Journalist

3
956 views