logo

నాయకులకు డబ్బా కొట్టే వ్యవస్థగా మారిపోయిన మీడియా

రాజకీయ పార్టీలకు, నాయకులకు డబ్బా కొట్టే వ్యవస్థగా మీడియా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి న్యూట్రాలిటీ స్థానంలో ఒక వర్గానికి కొమ్ముకాసే స్థాయికి మీడియా దిగజారిపోయింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు నాయకులను మించిపోయి మీడియా ప్రతినిధులు స్క్రిప్ట్ వర్క్ చేయడం జరుగుతుంది ఇందులో ఒక్క సాక్షి అనే కాదు లోకల్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు చానల్స్ పత్రికల పరిస్థితి ఇదే విధంగా ఉంది సాక్షి వైసిపి కాబట్టి సహజంగానే అందులో పనిచేసే వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు అలాంటప్పుడు సరైన ఆధారాలతో మాట్లాడితే ఇబ్బంది లేదు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే అధికారంలో ఉన్నవారు ఊరుకోరు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన సంస్థలను ఇలా ఇబ్బంది పెట్టిందో చూశాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా వ్యవహరించడం చాలా తక్కువ కాకపోతే ఇలాంటి సమయంలో కాస్త ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా సంస్థలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉంటేనే మంచిది కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు మీడియాలో ఆయన గురించి విపరీతంగా ప్రచారం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి స్వయంగా పట్టించుకున్నారు ఒకవేళ ఆయన స్థానంలో మరొకరు ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా మీడియా సంస్థలలో పనిచేసే వారు కూడా ఆలోచించుకోవాలని సీనియర్ పాత్రికేయులు పేర్కొంటున్నారు సరే ఏదైతే అయింది ఇప్పటికైనా జర్నలిస్టులు ఏ వర్గానికి కొమ్ము కాయడం మానుకోవాలని సీనియర్ జర్నలిస్టులు సూచిస్తున్నారు.

77
1005 views