logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రపంచ రక్తదాతల దినోత్సవము....

తేదీ: 14-06-2025:శేరిలింగంపల్లి, చందానగర్ :ఈరోజు ఉదయము ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *రక్తదానం ప్రాణదానంతో సమానం. రక్తం శరీరానికి ఇంధనం వంటిది"* అని అన్నారు. " *ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల కార్యక్రమాన్ని ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం ' _రక్తదానం చేయండి - ఆశను ఇవ్వండి - కలసి మనం ప్రాణాలను కాపాడుకుందాం'_ . ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛంద రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి, రక్తదానం చేసేందుకు వారిని చైతన్య పరచడంతో పాటు రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేయడం"* అని అన్నారు. " *పౌష్టికాహార లోపం ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి మందగించిన వారికి, ప్రమాదాలలో గాయపడిన వారికి, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి, యుద్ధ సమయంలో క్షతగాత్రులైన సైనికులకు, ప్రసవ సమయంలో గర్భిణులకు, తలసీమియా వ్యాధి గ్రస్తులకు రక్తం అవసరం పడుతుంది. రక్తం అవసరానికి తగినంత లభ్యత లేదు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా రక్తం మానవ శరీరంలో మాత్రమే తయారవుతుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా 40 లక్షల యూనిట్లు మాత్రమే దొరుకుతుంది"* అని అన్నారు. " *దేశ జనాభాలో 50 శాతం మంది రక్తదానానికి అర్హులే. కాని ప్రతి 1000 మందిలో కేవలం నలుగురు మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులు 18 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల వరకు రక్తదానం చేయవచ్చు. పురుషులైతే ఒక సంవత్సరములో మూడు నుండి నాలుగు మార్లు రక్తదానం చేయవచ్చు. స్త్రీలు రెండు పర్యాయములు ఇవ్వవచ్చు. రక్తదానం చేయడం వలన ఒకరి ప్రాణాన్ని కాపాడామనే ఆత్మ సంతృప్తి మనకు కలుగుతుంది. రక్తదానం అధిక బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ ల వంటి రోగాల బారిన పడకుండా కాపాడటంతో పాటు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తదానం వలన యిటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి"* అని కోరారు. " *కార్ల్ ల్యాండ్ స్టీనర్ 1868 జూలై 14న ఆస్ట్రేలియాలో జన్మించాడు. ఆయన జీవశాస్త్రవేత్త మరియు వైద్యుడు. ఆయన మానవరక్తంలో గ్రూపులను కనుగొన్నాడు. దానికి గాను ఆయనకు 1930లో శరీరధర్మశాస్త్రానికి సంబంధించి _నోబెల్ బహుమతి_ లభించింది. ఆయన పోలియో వైరస్ ను కూడా కనిపెట్టాడు. ఆయన చేసిన సేవలకు గాను ఆయన జన్మదినమైన జూన్ 14ను ఆయన గౌరవార్ధం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నాము"* అని అన్నారు. ఈ సందర్భంగా కర్మయోగులైన 20 మంది రక్తదాతలకు (పదిసార్లు పైబడి రక్తదానం చేసినవారు) ఆత్మీయ సత్కారము (శాలువా మరియు బహుమతి) చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను, G.V. రావు, ప్రేమ్ సింగ్, బసవరాజు, కుర్రా మహేష్, B.సుధాకర్, బోయిన మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రామారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

54
6717 views