logo

అంగన్వాడీ కేంద్రంలో అమ్మ పేరుతో మొక్క నాటుడు కార్యక్రమం

టేకులపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తేజవత్ శంభూ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కొప్పురాయి గ్రామ పంచాయతీ, కొత్తూరు గ్రామం అంగన్వాడీ కేంద్రంలో అమ్మ పేరుతో మొక్క నాటుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శంభూ నాయక్ మాట్లాడుతూ... అమ్మను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూస్తామో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా చూడాలని, మొక్కలే జీవనదారం, చెట్లు లేనిదే జీవరాషుల మనుగడ లేదని, చెట్లు లేకపోతే వన్యప్రాణులకు ఆసరా లేక పక్షి జాతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని మొక్కల్ని, వనాలని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెల్ జిల్లా కన్వీనర్ మరియు ప్రభుత్వం ఉపాధ్యాయుడు వి.హతీరం నాయక్, అంగన్వాడీ టీచర్ పాయం రాంబాయి, బీజేపీ మండల కార్యదర్శి లక్పతి నాయక్, బీజేపీ మండల నాయకులు బోడ నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

31
1657 views