logo

అమ్మ జన్మనిస్తుంది- ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం పునర్జన్మణిస్తుంది--కొప్పుల.మురళి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పాండురంగాపురం, వెంకట్రావు పేట, చింతల బయ్యారం, మద్దెలగూడెం, చిన్న రాజుపేట ,సింగిరెడ్డిపల్లి , మల్లారం అమరవరం గ్రామ యూత్ మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తల సేమియా సికిల్ సెల్ అనీమియా తో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ మన ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది తల సేమియా సికిల్ సెల్ అనీమియా వ్యాధితో తో బాధపడుతున్న చిన్నారులకు సరైన సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతుండటంతో చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించడం ఒక్క రక్తదానంతోనే సాధ్యమని అన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో 40 మంది రక్తదానం చేశారని తెలిపారు.
తల సేమియా , సికిల్ సెల్ అనీమియా తో బాధపడుతున్న చిరునరులు 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారులను ఆదుకోవాలని కోరారు.
అడగగానే స్పందించి రక్తదానం చేసిన రక్తదాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించి అనంతరం రక్తదాతలకు ప్రశంస పత్రాన్ని షీల్డ్ లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ ఆదినారాయణ, లక్ష్మణ్ శ్రీకాంత్ సంతోష్ కిషోర్ రమేష్ మహేష్ అనిల్ రామకృష్ణ ప్రమోద్ నాగరాజు జంపయ్య సాయి రాజు సాయిదీప్ దితరులు పాల్గొన్నారు.

0
0 views