
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్-
ఉచిత మెగా వైద్య శిబిరం
తేదీ 08 - 06 -2025.ఈరోజు చిన్న కంజర్ల గ్రామం లో గల పంచాయతీ కార్యాలయం నందు ఫ్రెండ్స్ వెల్ఫెర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి ఆధ్వర్యంలో మెడికవర్ చందానగర్ వారి సౌజన్యం తొ ఉచిత మెగా వైద్య శిభిరం ఉదయం 8-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ.. మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), వాసన్ ఐ కేర్ డాక్టర్ నరేష్, డాక్టర్ యమ్ పవన్ రెడ్డి కౌ డెంటల్,తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ " *మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు"* అని అన్నారు. " *ఆరోగ్యమే మహాభాగ్యం" కావున, కొన్ని జాగ్రత్తలు తీసుకున్న యెడల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాల* ని తెలిపారు. " *సాధ్యమైనంత మేరకు ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల* "ని తెలిపారు. " *అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల* " ని సూచించారు. " *మనం తీసుకొనే ఆహారం సమయ పాలన పాటించాల* "ని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు, నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ప్రసాద్ యాదవ్, సాలె బలరాం, కురుమ వెంకటనారాయణ, కురువ శ్రీనివాస్, సి హెచ్. నరసింహారెడ్డి, జి మల్లారెడ్డి, సి హెచ్ సుధాకర్ రెడ్డి, గణపతి బాలకృష్ణ,మాజీ ఎంపీటీసీ శ్రీమతి గాయత్రి యాదవ్ తదితరులు.అలాగే హాస్పిటల్ ప్రతినిధి నరేష్ పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో 102మందికి వైద్యసేవలు అందించారు.