
మండల లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కి హాజరైన సి.సి.హెచ్ లు
రోలుగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సి సి హెచ్ కార్యక్రమానికి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , మండల శాఖ విద్యాశాఖ అధికారి, వివిధ పాఠశాల నుంచి వచ్చిన సి సి హెచ్ లు మరియు ట్రైనింగ్ రిసోర్చ్ పర్సన్స్ హాజరయ్యారు. ట్రైనింగ్ లో భాగంగా మండల విద్యాశాఖ అధికారి వన్ జాన్ ప్రసాద్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు అందరూ గ్యాస్ పైనే వంట చేయాలని, తాజా కూరగాయలను వాడాలని పరిశుభ్రతను పాటించాలని, విద్యార్థులకు సేవకులుగా భావించి మంచి సేవలు అందించాలని తెలిపారు. మండల విద్యాధికారి టు జగ్గారావు మాట్లాడుతూ నిర్వాహకులు తప్పనిసరిగా మెనూ పాటించాలని, పిల్లలకు చక్కని పోషణ అందించే వంటకాలను తయారు చేయాలని, అన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టీ.వీ. శేషగిరి మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం పెట్టే మీరంతా ఉపాధ్యాయుల కంటే అదృష్టవంతులని, ఇంతటి మంచి అవకాశాన్ని సక్రమంగా ,పరిశుభ్రంగా, ఆరోగ్యంగా వండి విద్యార్థులకు అందించాలని కోరారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన ప్రసన్న మేడం మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అంత ఉన్నతంగా నిర్వహిస్తూ తల్లిదండ్రులు అందరు మనల్ని పొందాలని అధికారులు ఆదేశించిన అన్ని అంశాలను పాటిస్తూ మధ్యాహ్నం భోజనం పథకం విజయవంతం చేయాలని కోరారు. ట్రైనింగ్ అనంతరం వివిధ పాఠశాల నుంచి వచ్చిన సిసిహెచ్ లు తాము తెచ్చిన అన్ని రకాల వంటకాలను స్టాల్లో నిర్వహించి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో పాటు మండల విద్యాశాఖ అధికారులు ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, రోలుగుంట స్కూల్ కాంప్లెక్స్ పరవాడ సతీష్ పాల్గొన్నారు.