logo

మండు వేసవిలో కూడా శారదామృత సేవా ట్రస్ట్ సేవలు భేష్

పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామపంచాయతీ పరిధిలో డా. విస్సాప్రగడ సత్యహరి స్థాపించిన శారదామృత సేవా ట్రస్ట్ ద్వారా సేవలను కొత్తకోణంలో జనాలలోకి తీసుకుని వెళ్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. యాచకులను వెతుక్కుంటూ సుమారు 70 నుండి 100 మందికి రోజు భోజనం ట్రస్ట్ సభ్యులే వెళ్ళి వారికీ అందివ్వడం, పాలకొల్లు, నరసాపురం పరిధిలో గల ఎన్నో గోవులకు వీరు రోజు ఆహారం అందివ్వడం వంటి పనులు చేస్తున్నారు. ట్రస్ట్ ద్వారా గోశాల ఏర్పాటు చేయాలని, ఉచితంగా విద్యను అందించాలనే ప్రొజెక్టులు కూడా ఉన్నాయని దాతలు ముందుకు వస్తే అవి చేయడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడతాయని ట్రస్ట్ ఫౌండర్ డా. వి. సత్యహరి అభిప్రాయపడ్డారు

0
0 views