కేతిరెడ్డి నాయకత్వం లో భారీ ప్రజా ప్రదర్శన ధర్నా.
అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం లోని మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి కార్యాలయం నుండి ఆయన నాయకత్వంలో భారీ ప్రజా ప్రదర్శన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలం సాగిన పాలనలో చేసిన మోసాలను గురించి ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున వైయస్సార్ పార్టీ కార్యకర్తలు ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రజలకువ్యతిరేకంగా వారు సాగిస్తున్న రాక్షస పాలన గురించి వివరిస్తూ వైయస్సార్ సిపి శ్రేణులు చేస్తున్న నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రదర్శన కేతిరెడ్డి కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ కళా జ్యోతి సర్కిల్ పాండురంగ సర్కిల్ మీదుగా తిరిగి ఆర్డిఓ కార్యాలయమునకు చేరుకుంది ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమిప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని ఏడాది పూర్తి అయిన ఇప్పటివరకు వారు చేసిన వాగ్దానాల్లో ఒక్కటిగాని నెరవేర్చలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన నారా వారు రెండు లక్షల 80 వేల వాలంటీర్స్ ఉద్యోగం నుండి వెళ్లగొట్టారని అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంటి వద్దకే రేషన్ బియ్యం తీసుకు వెళుతున్న 20,000 మందికి ఉపాధి లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఓటు వేయని వారిని తమను వ్యతిరేకించిన వారిని ప్రధానంగా వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలను. నాయకులను వేధించడం దాడులు చేయడం తప్పుడు కేసులు బనాయించడం తమకు అనుకూలమైన పోలీసులతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోలీసు వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. పేదవాడికి న్యాయం కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వము నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయని అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని క్రమం తప్పకుండా అమ్మ ఒడి రైతుభరోసాడ్వాక్రాసంఘాలకురుణమాఫీ.తక్కువ వడ్డీకే రుణాలు. వృద్ధులకు వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్లు.చేనేతలకు అండగా 24 వేల రూపాయలు ఇచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజలకు అన్ని రకాల సేవలనుఅందుబాటులోఉండేవిధంగాచూశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు మోసపోయారని నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బాబు ప్రజలకు నేడు వెన్నుపోటు పొడిచారని తెలిపారు నాడు తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు కు వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు వైయస్ జగన్ వర్ధిల్లాలి కేతిరెడ్డి వర్ధిల్లాలి అనే నినాదాలు చేశారు ఆర్డీవో కార్యాలయం నినాదాలతో మారు మోగింది.