logo

జగన్ రెడ్డి – దళిత వ్యతిరేక పాలనకు బ్రాండ్ అంబాసిడర్, గంజాయి మాఫియాకు మేనమామ!

*జగన్ రెడ్డి – దళిత వ్యతిరేక పాలనకు బ్రాండ్ అంబాసిడర్, గంజాయి మాఫియాకు మేనమామ!*

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, జూన్ 4 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

వైఎస్ జగన్‌ రెడ్డి పాలనలో దళితులు ఎదుర్కొన్న అవమానాలు, దాడులు, అన్యాయాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు.
ఇప్పుడు తెనాలిలో జరిగిన ఘటనపై ఆయన స్పందన చూస్తే, దళితుల పట్ల ఉన్న అసలు ధోరణి మళ్లీ బయటపడింది.

నిజమైన బాధితులకు మొహం చూపని జగన్, నేరస్తులను పరామర్శించడం మానవత్వమా?

తెనాలిలో ఓ కానిస్టేబుల్‌ను చంపేందుకు ప్రయత్నించిన గంజాయి మాఫియాతో సంబంధాలున్న రౌడీషీటర్లను పరామర్శించేందుకు జగన్ వెళ్లడం ఎంత దుర్మార్గమో ప్రజలకు తెలుసు.

*ఈ నేపథ్యంలో నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. ఆమె వెల్లడించిన ఖండనలో ముఖ్యాంశాలు ఇవి:*

నేరస్తులను కులం పేరుతో రక్షించాలనుకోవడం కేవలం కులరాజకీయం మాత్రమే కాదు – ఇది పోలీసు వ్యవస్థను అవమానపరచడం, దళితుల గౌరవాన్ని కించపరచడమే.

జగన్ పాలనలో దళితుల పట్ల జరిగిన లెక్కలేనన్ని దాడులలో కొన్ని ఘటనలు:

డా. సుధాకర్ అవమానం: మాస్కులు అడిగినందుకు లాఠీతో కొట్టించారు. మానసిక రోగిగా చిత్రీకరించారు. చివరికి అనుమానాస్పదంగా చనిపోయారు. జగన్ ఒక్క మాట మాట్లాడలేదు.

ఓం ప్రతాప్ హత్య: కల్తీ మద్యం వ్యతిరేకంగా పోరాడిన ఓ యువ దళితుడిని హత్య చేశారు. జగన్ స్పందించలేదు.

డ్రైవర్ హత్య: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలారు. ప్రభుత్వం న్యాయం చేయలేదు. అతన్ని కనీసం పదవి నుంచి కూడా తొలగించలేదు

శిరోముండనం ఘటన: పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడిని అవమానించారు. నిందితులను కాపాడే ప్రయత్నమే జరిగింది.

నందిగామ దళితులపై దాడులు: ఇళ్ల స్థలాల కబ్జాలు, మహిళలపై దాడులు,
ముఖ్యంగా చదువుకుంటున్న దళిత విద్యార్థిపై మూత్రం పోసిన ఘటనలో – జగన్ ఎక్కడా స్పందించలేదు.

తెనాలి పర్యటనలో జగన్ రెడ్డి జవాబు చెప్పాల్సిన విషయాలు:

❓ జగన్ రెడ్డి పాలనలో దళితులు బాధపడినప్పుడు జగన్ ఇంటికొచ్చారా? పరామర్శించారా?
ఈరోజు కానిస్టేబుల్‌పై దాడి చేసిన నేరస్థులను పరామర్శించడం ఏం న్యాయం ఉంది..?

జగన్ అసలు ధోరణి ఇదే:

బాధితుడు దళితుడైతే మౌనం!

నిందితుడు దళితుడైతే పరామర్శ!

నేరస్థుల కోసం "కులం" ముసుగు!

పోలీసులపై దాడి చేసినవారికి జైకొట్టడం!


ఇది దళితుల పట్ల ప్రేమ కాదు. ఇది కులాన్ని అడ్డం పెట్టుకుని నేరస్థులకు మద్దతు ఇచ్చే నీచ రాజకీయమే.

జగన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు...

డా. సుధాకర్‌పై ఎప్పుడైనా మాట్లాడారా?

ఓం ప్రతాప్ హత్యపై స్పందించారా?

డ్రైవర్ హత్యకు న్యాయం చేశారా?

నందిగామ దళిత విద్యార్థిపై మూత్రం పోసిన విషయంలో స్పందించారా? ... ఈ విషయంలో దళిత విద్యార్థి కి అండగా ఉండకుండా మూత్రం పోసి అవమానించిన అగ్రవర్ణాల విద్యార్థులకు అండగా ఉన్న "మొండితోక సోదరులను" కనీసం మందలించారా..?


కానిస్టేబుల్‌పై దాడి చేసినవాళ్లకు ఎందుకింత ప్రేమ?

జగన్ – గంజాయి బ్యాచ్ కు మద్దతు..!

రౌడీషీటర్ల పరామర్శ జగన్‌ మానసిక స్థితిని వెల్లడిస్తోంది. నేరాన్ని సమర్ధించాలంటే ఏ స్థాయికి పడిపోతారో ప్రజలు చూస్తున్నారు.

రౌడీషీటర్లకు ‘దళితులు’ అని ట్యాగ్ వేసి రక్షణ ఇవ్వాలనుకోవడం, వారిపై జరిపిన పోలీసు చర్యలను కుల కోణంలోకి తిప్పడం – ఇది ప్రజల మనస్సులపై తప్పుడు ప్రభావం కలిగించాలనే కుట్ర. ఇది సమాజాన్ని విభజించాలనే కుయుక్తి.


టీడీపీ స్టాండ్ స్పష్టంగా ఉంది:
నేరానికి కులం లేదు!

✅ దళితుల హక్కులు మా బాధ్యత!
✅ పోలీసులపై దాడిని ఖండిస్తాం!
✅ గంజాయి మాఫియాను అంతమొందిస్తాం!
✅ దళితులు తలదించుకునే పరిస్థితులు జగన్ సృష్టించినవి – మేము గౌరవం పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నాం!
జగన్ – గంజాయి మాఫియాకు మేనమామ, దళితులకు ద్రోహి!

జగన్ రెడ్డి గంజాయి బ్యాచ్ కు మేనమామగా వ్యవహరిస్తున్నారని, నేరస్థులను పరామర్శిస్తూ దళితుల ముద్ర పెట్టే కుట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఇది వైసిపి రాజకీయ పతనానికి సంకేతం.

0
0 views