logo

తల్లికి వందనం పథకం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది

తల్లికి వందనం పథకం :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ప్రతి పిల్లవాడికి 15 వేల రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు జమ చేయమన్నారు. దీని ద్వారా తల్లికి పిల్లలు చదువులు చదివించడానికి కావలసిన ఆర్థిక స్తోమత లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా...???

@లింకింగ్ ఎలా చెక్ చేయాలి?:
మీరు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి
లేదంటే మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో కూడా NPCI లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://www.npci.org.in

@NPCI ( National Payments Corporation of India) లింక్ స్టేటస్ ఎలా చూసుకోవాలి?
మీ బ్యాంకు ఖాతా ఆధార్ తో NPCI లో మ్యాప్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ బ్యాంకుకు వెళ్ళవచ్చు, లేదా సచివాలయం ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనితోపాటు అదనంగా కొన్ని రాష్ట్రాల్లో NPCI లింకు చెకింగ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు.
@తల్లికి వందనం పథకం వివరాల:
ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ₹15,000/- ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 75% హాజరు కలిగి ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది
ప్రతి విద్యార్థికి ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ నిధులు జమవుతాయి
_______________________
-తలిదండ్రులారా... మారుదాం....! మారుద్దాం ...!!!
-తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం..మన పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం....
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మన పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".

0
242 views