ఈనెల 5న మాలల సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ రాక
రాష్ట్ర మాలల సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ DD డి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయా వర్గాలతో భేటీ అయ్యి వారికి అందుతున్న పథకాలను తెలుసుకుంటారని, కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమై పథకాల అమలుపై చర్చిస్తారని పేర్కొన్నారు.