logo

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి..తాసిల్దార్ ముజీబ్...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా మద్నూర్ మండలంలో తొలిరోజు ధన్నూర్, సోముర్ గ్రామాల్లో రెవిన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిని వ్యవసాయదారులు రెవెన్యూ సదస్సులో పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. దన్నూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆ గ్రామ, పంచాయతీ కార్యదర్శి జె.మనోహర్, రెవిన్యూ సిబ్బంది దశరథ్, మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు మారుతి, రిటైర్డ్ వి.ఆర్.ఓ మారుతి, మధుకర్, ఇతరులు పాల్గొన్నారు. వీరితోపాటు ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు. ఈనెల 4న రెవెన్యూ సదస్సులు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు సదస్సులు జరుగుతాయని తాసిల్దార్ తెలియజేశారు.

1
0 views