
4 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
శ్రీకాకుళం: ఒడిశా నుంచి గుజరాత్కు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యవకులను ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు.మంగళవారం ఇచ్ఛాపురం పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవా పోలీసులు తనిఖీలు నిర్వహిండగా.. బీహార్లోని బాగల్పూర్జిల్లా కాసరి గ్రామానికి చెందిన ఎండీ షెకావత్ అనే యువకుడు, ఒడిశాలోని గంజాం జిల్లా పాత్రపూర్బ్లాక్ ధర్మపూర్ గ్రామానికి చెందిన దల బెహర చిత్రసేన్ అనే యువకుడు బ్యాగ్లలో 3.990 గ్రాములు గంజాయితో పట్టుబడ్డారు. బీహార్కి చెందిన ఎండీ షెకావత్ అనే వ్యక్తి గుజరాత్ రాష్ట్రం వాపిలో నివాసముంటూ చిత్రసేన్ ద్వారా ఒడిశా నుంచి గంజాయిని తీసుకెళ్లి అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో చిత్రసేన్ గంజాయిని తీసుకొచ్చి షెకావత్కి అందజేసే క్రమంలో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించారు. అక్రమ రవాణాను అడ్డుకున్న పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై ముకుందరావు, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.