సిమెంట్ లారీ దగ్ధం
శ్రీకాకుళం:నసన్నపేట మండలం తామారాపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్ లారీ దగ్ధమైంది. విశాఖ నుంచి పూరీ వెళ్తుండగా తామరాపల్లి వద్దకు వచ్చే సరికి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయగా లారీ నిలుపు చేసి తగిన జాగ్రత్తలు తీసుకొనే లోపే మరింతగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా ఎస్ఎఫ్ఓ వరహాలు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. అప్పటికే లారీ కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 5 లక్షల పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు లారీ సిబ్బంది చెబుతుండగా.. అగ్నిమాపక సిబ్బంది మాత్రం రూ.2.5 లక్షల వరకూ నష్టం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.