యోగా తో మానసిక ఉల్లాసం
యోగాతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం అన్నారు. మంగళవారం అరకులోయ మండలం గిరిజన మ్యూజియం వద్ద జరిగిన టూరిస్ట్ డెస్టినేషన్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ యోగా యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలని, మన దినచర్యలో బాగంగా చేసుకోవాలని తెలియజేశారు. యోగా ప్రతి రోజూ చేయడం వలన ఒత్తిడిని అధిగమించవచ్చని, ఇది శాస్త్రీయంగా రుజువైందని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పాటిల్ తెలిపారు. 30 రోజుల పాటు యోగా చేయడం వలన మానసిక ఉల్లాసం, ఒత్తిడి తగ్గుతాయనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ ఇంఛార్జ్ ఎంపిడిఓ సత్యనారాయణ, తాహశీల్దార్ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి దాసు, పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, ఎంఈఓ త్రినాధరావు, మండల టీడీపీ అధ్యక్షులు లొక్కొయి మహదేవ్, అన్ని శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.