రేషన్ కార్డ్ లోని వారికి 65ఏళ్ళు దాటితే ఇంటివద్దకే రేషన్.
రేషన్ కార్డు లోని అందరూ 65 ఏళ్లు దాటినవారైతే వారి రేషన్ ఇంటివద్దకే వస్తుందని అరకులోయ తాహశీల్దార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తాహశీల్దార్ పేర్కొన్నారు. కావున మీ రేషన్ కార్డులోని వారు 65సంవత్సరాలు దాటితే వారి రేషన్ షాపుకి వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. రేషన్ షాపు డీలర్ వారి ఇంటివద్దకు వెళ్లి రేషన్ అందజేస్తారని తెలిపారు. ఈ క్రమంలో అరకులోయ డీలర్ కిల్లో నిర్మల ఓ వృద్దు ఇంటి వద్దకు వెళ్లి మంగళవారం సాయంత్రం రేషన్ అందజేశారు.