
కరెంట్ షాక్ తో 4 గేదెలు మృతి.
4లక్షల నష్ట పరిహారం జరిగిందని
బాధితుడు,గేదెల యజమాని మైనగాని. రాముడు. లబో దిబో
కరెంట్ షాక్ తో 4 గేదెలు మృతి.
4లక్షల నష్ట పరిహారం జరిగిందని
బాధితుడు,గేదెల యజమాని మైనగాని. రాముడు. లబో దిబో
అచ్చంపేట,జూన్ 03,:
నాగర్ కర్నూల్. మండలపరిధి లోని శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాముడు.తమ కుటుంబ పోషణ నిమిత్తం 4గేదెలను మేపుకొని బతుకు జీవనము సాగించే వాడని రోజు వారి దినచర్య గా 4గేదెలను మెపడానికి గ్రామ శివారులో గల రంగ నాయకులదేవస్థానం దగ్గర లో గల చేపల గుంత దగ్గరఉన్న వ్యవసాయపొలం లో మేత కు వెళ్లిన నాలుగు గేదెలు కరెంట్ షాక్ తో అక్కడి కక్కడే మృతి చెందాయి. కరెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం కారణంగా నాలుగు గేదెలుచనిపోయాయని అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పొలం లో అక్కడక్కడ కరెంట్ స్థంభాలకు విద్యుత్ తీగలను బండలు ,కర్రలుపాతి తీసు కోవడం వల్ల మేతకు అటు వైపుగా వెళ్లిన గేదెలు ఒక్క సారిగా కర్రలకు తగలడం తో వైర్ కింద పడి 4గేదెలు కరెంట్ షాక్ తో చనిపోయాయని స్ధానిక ప్రజలు తెలిపారు.ముమ్మాటికీ ఈ ఘటనకు పూర్తిగా కరెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం కారణ మే అని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఘటన కారణంగా ఒక కుటుంబంజీవనోపాధి కోల్పోవడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు గేదెలు ఒక్కో
గేదే విలువ 1లక్ష వరకు ఉంటుందని. మొత్తం 4లక్షలరూపాయల ను నష్ట పోయా రనితెలిపారు .కరెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం కారణంగా గేదేలుచనిపోయాయని గ్రామ ప్రజలు తమ అసంతృప్తి ని వ్యక్తం చేశారు. విద్యుత్,డిపార్ట్మెంట్ అధికారుల ను కోరడం ఏమనగా మా గ్రామ శివారులో. గ్రామ ములో కరెంట్ వైర్లు కిందికి వంగి భయంగాకనపడుతున్నాయనివాటిని వెంటనే సరి చేసి గ్రామం మొత్తం పరిశీలించి కరెంట్ వైర్లుసరిచేయాలని గ్రామప్రజలుడిమాండ్ చేశారు. విద్యుత్ షాకుతోమరణించిన గేదెలయజమాని కి నష్ఠ పరిహారం ఇవ్వాలనిఅధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.