logo

MLC దువ్వాడను జగన్ పక్కన పెట్టేసారా?

తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీగా మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తన వ్యక్తిగత వ్యవహార శైలితో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు.
ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉన్నా.. దువ్వాడ శ్రీనివాస్ ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. దానికి కారణం ఆయన కుటుంబ వ్యవహారం. దివ్వెల మాధురితో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఆయన వైఖరితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే వీర విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే పార్టీ ఆయనపై వేటు వేయడంతో భార్య దువ్వాడ వాణి ఇప్పుడు యాక్టివయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

* దూకుడు కలిగిన నేత..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district ) రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది ప్రత్యేక స్థానం. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచింది లేదు. 2006లో మాత్రం జడ్పిటిసి ఎన్నికల్లో గెలిచిన ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేవారు. ఆ తరువాత టెక్కలి నుంచి అసెంబ్లీకి, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాడు రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంతో పాటు జగన్మోహన్ రెడ్డి వేవ్ లో సైతం గెలవలేకపోయారు. అయితే దూకుడు కలిగిన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే కుటుంబ వివాదం లో చిక్కుకొని.. పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు అన్న నేతల ఫిర్యాదులతో జగన్మోహన్ రెడ్డి ఆయన పై వేటు వేశారు. అయితే అప్పటినుంచి టెక్కలి వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆయన భార్య వాణి పాల్గొంటున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

అమ్మకానికి విశాఖ.. కేశినేని నాని సంచలనం!

* సీనియర్ నాయకురాలిగా గుర్తింపు..
దువ్వాడ వాణి( duvvada Vani ) పొలిటికల్ గా సీనియర్ నాయకురాలు. ఆమె తండ్రి సంపతరావు రాఘవరావు సీనియర్ కాంగ్రెస్ నేత. తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం టెక్కలి ఎంపిపి గా పని చేశారు. ఒక విధంగా చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్కు రాజకీయంగా ప్రోత్సాహం అందించింది కూడా ఆయనే. దువ్వాడ వాణి సైతం 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ టికెట్ ఆమెకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టెక్కలి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉండేవారు. ఆ సమయంలోనే కుటుంబంలో వివాదం ప్రారంభం అయింది. అప్పుడే దువ్వాడ వాణికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆమెకే టిక్కెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించారు జగన్. ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవడం, ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, ప్రేయసి దివ్యల మాధురి తో కలిసి ఆయన హల్చల్ చేయడం వంటి కారణాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాసులు సస్పెండ్ చేశారు జగన్.

* ప్రత్యర్ధులకు సవాల్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో తన ప్రత్యర్ధులు ఈ పని చేయించారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు దువ్వాడ వాణి యాక్టివ్ కావడాన్ని పట్టుకోలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతోంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు 8 నెలల కిందట రాజీనామాలు కూడా చేశారు. వారి రాజీనామాలు ఇంత తవరకు ఆమోదానికి నోచుకోలేదు. అందుకే ఇప్పుడు తాను రాజీనామా చేసి పార్టీని ఇరుకున పెట్టాలని.. శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీలో తన ప్రత్యర్థులకు సవాల్ విసరాలని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారట. మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.

5
270 views