అనంతగిరి: 90% రాయితీతో అందుబాటులో విత్తనాలు
అనంతగిరి మండలానికి 90% సబ్సిడీ తో 330 క్వింటాళ్ళ ధాన్యం (RGL-2537, MTU-112, MTU-1318, స్వర్ణ రకాలు) విత్తనాలు వచ్చాయని ఎంఏఓ ఉమామహేశ్వరి మంగళవారం తెలిపారు. అలాగే 18 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం 90% రాయితీకి అందుబాటులో ఉన్నట్లు ఎంఏఓ చెప్పారు. ఎకరాకు 30 కేజీల ధాన్యం విత్తనం ఇస్తారని తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు ఆధార్, భూమి పట్టా జిరాక్స్ లతో ఆయా రైతు సేవా కేంద్రాలలో పొందవచ్చన్నారు.