
Andhra: పాఠశాల విద్యార్థులకు పండగలాంటి వార్త చెప్పిన ఏపీ సర్కార్......
ఏపీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలు,సంక్షేమ హాస్టళ్లలో రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతోంది....
పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో… ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు....
https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-government-to-supply-fine-quality-rice-formid-day-meals-in-schools-and-hostels-from-june-12-1549838.html