logo

ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో ప్రజలంతా భాగస్వాములు కావాలి: మిత్తిరెడ్డి మధు



భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సారథి నీటి సంఘం సభ్యులు నేడు మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది మనసులో మాట (మాన్ కి బాత్) కార్యక్రమంలో మాట్లాడుతూ 5 జూన్ 2025 తేదీన "ప్రపంచ పర్యావరణం దినోత్సవం" పురస్కరించుకుని కేంద్రంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో
ప్రజలను భాగస్వాములను చేసి
చెట్లు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంల నిర్వహించాలన్నారు,
మోది గారి పిలుపును అందిపుచ్చుకొని కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్సీ స్కూల్స్, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయలు, నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య విద్యాలయాలు, పీఎం శ్రీ విద్యాలయాల విద్యార్థులు, టీచర్స్ కలసి అమ్మ పేరు మీద ఒక మొక్క (ఏక్ పెడ్ మాకే నమ్) నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు, బాధ్యతాయుత దేశ పౌరులుగా ప్రధానమంత్రి గారు పిలుపును అందిపుచ్చుకొని విజయనగరం పార్లమెంటు జిల్లా పరిధిలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, మహిళలు, తాము నివసిస్తున్న పరిసర ప్రాంతాలలో విరివిగా చెట్లు నాటి వాటిని పోషించే బాధ్యత కూడా తీసుకోవాలని తద్వారా స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందన్నారు, మరియు నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందన్నారు.

10
852 views
1 comment