ఒంటరి మహిళా మెడ లో బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!!
AIMA MEDIA #జూన్ 2#సోమవారం # విశాఖపట్నం..
న్యూస్ 9 :- విశాఖపట్నం జిల్లా, గాజువాక సమీపంలో నిద్రపోతున్న వృద్ద మహిళ మెడలో బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు వ్యక్తులు ను గాజువాక క్రైమ్ పోలీసులు పట్టుకొని కోర్టు కు హాజరు పరిచారు, ఈ ఇద్దరు పాత నేరస్తులు అని వివరించిన క్రైమ్ క్లూస్ బృందం. వివరాలు లోకి వెళ్తే...ఇటీవలి బంగారు గొలుసు స్నాచింగ్ కేసులో ఇద్దరు అలవాటు నేరస్తులు అరెస్ట్
వివరాలు:
తేదీ 27.05.2025 ఉదయం 11:00 గంటల సమయంలో, శ్రీమతి ఉరుకుటి నూకలమ్మ (లేట్ ముసలయ్య భార్య, వయస్సు 60 సంవత్సరాలు) గారు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆమె తన చిన్న కుమారుని ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఆమె కుమారుడు, కోడలు, మరియు వారి పిల్లలు బెడ్రూమ్లో నిద్రిస్తారు. ఆమె ప్రధాన హాలులో, కిటికీ దగ్గర నిద్రిస్తుంటారు.తేదీ 26.05.2025, రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులు నిద్రించగా, నూకలమ్మ గారు కిటికీ దగ్గర తలుపు వేసుకుని పడుకున్నారు. తేదీ 27.05.2025 అర్థరాత్రి 02:00 గంటల ప్రాంతంలో, ఆమె గాఢనిద్రలో ఉండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి కిటికీ దగ్గరికి వచ్చి, ఆమె మెడలో ఉన్న రెండు పేటల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.ఆమె అరుపులు విని, ఆమె కుమారుడు సన్యాసిరావు బయటకు వచ్చి, పల్సర్ బైక్పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పారిపోతున్న దృశ్యం చూశాడు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, బంగారు గొలుసుతో పరారయ్యారు. దీంతో ఆమె పోలీసులను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్ కేసు నమోదవడంతో, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, శ్రీమతి కె.లతా మాధురి (DCP – Crimes) మరియు శ్రీ మోహన్ రావు (ADCP – Crimes) పర్యవేక్షణలో, శ్రీ డి. లక్ష్మణరావు (ACP – జోన్ 2), ఇన్స్పెక్టర్ శ్రీ కె. శ్రీనివాస్ రావు (సౌత్ సబ్ డివిజన్ – క్రైం) ఆద్వర్యం లో SI A. మన్మధరావు మరియు PCs 3098, 3399, 3394, 3794, HG సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి క్లూస్ సేకరించారు.
పోలీస్ క్రైం టీం ఉత్తమ దర్యాప్తు నైపుణ్యం చూపుతూ, నిందితుల సమాచారం సేకరించి, 01.06.2025 రాత్రి 8:00 గంటలకు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.నిందితుల ఒప్పంద ప్రకారం, ఈ కేసులో Cr No. 237/2025, U/S 304(2) BNS కింద, మొత్తం రూ.56,250/- విలువైన రెండు పేటల బంగారు గొలుసు మరియు Pulsar NS 150 బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల గురించి సమాచారం:
ఏ1 : చేపల ఆనంద్ S/o అమ్మోరు, వయస్సు 24 సంవత్సరాలు, కులం వాడబలిజ, R/o సరస్వతి స్కూల్ దగ్గరలో, పైడిమాంబ కాలని, గాజువాక, విశాఖపట్నం
ఏ2: కంబాల శ్రీరాజు S/o నూకతల్లి, వయస్సు 22 సంవత్సరాలు, D.No.15-4-116, GVM స్టార్ దగ్గరలో, గంగవరం, పెదగంట్యాడ, విశాఖపట్నం
నిందితులు ఇద్దరూ స్నేహితులు.చెడు అలవాట్లు మరియు లగ్జరీ జీవితానికి అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలని భావించి, స్నాచింగ్కు పాల్పడ్డారు.ఇధి వరకే నేరస్తులు పై కేసు లు ఉన్నాయి మరియు suspect షీట్స్ కలవు.
విశాఖపట్నం పోలీసుల ప్రజలకి విజ్ఞప్తి:
• ఒంటరిగా మహిళలు , ముసలి వారు బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండండి.
• వెలుగు లేని చోట్లలో, రాత్రివేళ ఒంటరిగా నడవకుండా ఉండండి.
• బైక్లో అనుమానాస్పదంగా వెంబడించేవారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
• హ్యాండ్బ్యాగ్ను రోడ్డుకి అతి దగ్గర కాకుండా లోపల వైపు పెట్టుకోండి.
• సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నడవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
• "112" నెంబర్ను స్మార్ట్ఫోన్లో హాట్కీగా సెట్ చేసుకొని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే Dial 112 కు కాల్ చేయాలి.
• ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు LHMS App తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి.
• విలువైన వస్తువులను బీరువాల్లో ఉంచి తాళం వేసి భద్రంగా ఉంచాలి.
• డబ్బులు, వస్తువులు దిండు కింద లేదా బయట దాచే అలవాటును మానుకోవాలి.
• ప్రధాన కాలనీల్లో స్థానికులు కలసి CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు కోరుతున్నారు.