logo

మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున అందజేసిన ఎమ్మెల్సీ నాగబాబు

విజయనగరం జిల్లా. రాజాం..

రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మరణించిన 101 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు చేతుల మీదగా 5 కోట్ల, 5 లక్షల రూపాయలు అందజేత...ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం, పొనుగుటివలస గ్రామం నుండి క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జన సైనికుడు కీ"శే" కెంబూరు వైకుంఠరావు ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయలు చెక్కును ఆర్థిక భరోసా గా వైకుంఠరావు అమ్మ కళావతి,భార్య రాధాకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు, రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు గార ఎర్రంనాయుడు, శెట్టి ఆదినాయుడు, లెంక అన్నంనాయుడు, మీసాల శ్రావణ్ కుమార్, పొగిరి శివ, వారాడ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

33
1040 views