logo

అంగరంగ వైభవంగా సాగిన "స్వర బృందావనం" 18 వ సంగీత విభావరి "మెగా ఈవెంట్" విశాఖపట్నం

నాడు 2024 ఆగష్టు 15 న చిన్నగా మొదలైన "స్వర బృందావనం" అంచెలంచెలుగా ఎదిగి "అలుపెరుగని బాటసారి రవికాంత్" మరియు శ్రీ కుమార్ ల సారథ్యంలో నేడు 01.06.2025 నా 18 వ అడుగు వేసింది.
కీర్తిశేషులు శ్రీ పి.వి.నీలకంఠం, సన్యాసమ్మ దంపతుల మరియు కీర్తిశేషులు శ్రీ డి.వి.రమణారావు,సూర్యం దంపతుల యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీయుతులు రాంబాబు, వెంకట రమణ మూర్తి, నాగేశ్వరరావు మరియు శ్రీమతి సీత ల సంయుక్త సమర్పణలో "స్వరాలయ సింగింగ్ స్టూడియోస్ అక్కయ్యపాలెం, విశాఖపట్నం" నందు స్వర బృందావనం వ్యవస్థాపకులు శ్రీ రవికాంత్ మరియు సహ వ్యవస్థాపకులు శ్రీ కుమార్ ల సంయుక్త సారధ్యంలో 01.06.2025 న 18 వ సినీ సంగీత విభావరి మెగా ఈవెంట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరు మంత్రముగ్ధులయ్యేరనడానికి ఈ ప్రదర్శన కు ఇప్పటికి 1200 వ్యూస్ రావడమే నిదర్శనం.
ఈ కార్యక్రమానికి మిక్కిలి సంతసించిన "క్రాంతి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శ్రీ యన్.వి.రెడ్డి మరియు వారి మనుమడు శ్రీ బబ్బీ ఇందులో పాల్గొన్న గాయనీ గాయకులకు మంచి విందు భోజన సౌకర్యాలు కలుగజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
కార్యక్రమానికి శ్రీ రాంబాబు చిన్ననాటి స్నేహితులు కూడా విచ్చేసి తమ స్నేహ శీలతను, ఆనందాన్ని పంచుకున్నారు. అందులో శ్రీ జోగారావు దంపతులు గాయనీ గాయకులు కావడంతో తమ హిందీ తెలుగు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టేజ్ ని పూలమాలలతో అత్యద్భుతంగా అలంకరించారు. యథాప్రకారం రాంబాబు వినాయక ప్రార్ధన తోను సీత దీపాలంకరణ తోను కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై, రాత్రి 9 గంటలకు ముగిసింది. ఇక పాటల విషయానికి వేస్తే అందరూ ఉత్తమ గాయనీ గాయకులు కావడంతో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావం లేకుండా అందరూ ప్రేక్షకులను సమానంగా అలరించారు. "నమో భూతనాథా" అనే ఈశ్వర ప్రార్థనా గేయాన్ని వెంకట రమణ మూర్తి, సీత ఆలపించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అశ్లీలతకు తావు లేకుండా పాటల ఎంపిక లోను, పాడడం లోను అత్యంత శ్రద్ధ తీసుకున్న గాయనీ గాయకులు వ్యవస్థాపకులు, యాంకర్ అయిన శ్రీ రవికాంత్ నేతృత్వంలో అద్భుతంగా పాడి "స్వర బృందావనం" గౌరవాన్ని పెంచారు.
ఈ కార్యక్రమం లో హైదరాబాద్ వారే కాకుండా విశాఖపట్నం గాయనీ గాయకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో శ్రీయుతులు రవికాంత్, శ్రీ కుమార్, రాంబాబు, వెంకట రమణ మూర్తి, నాగేశ్వరరావు, సురేంద్ర, జోగారావు, రఘు ప్రభృతులు, శ్రీమతులు సీత, సౌజన్య, చంద్రకళ, శ్రీదేవి, కౌసల్య కుమారి, సాయి గాయత్రి, సాయి జగతి, పద్మ, విద్య ప్రభృతులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.

174
6615 views