
ప్రజల బాధలను కూటమి ప్రభుత్వం గుర్తించింది.. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తాం.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు
ప్రజలను ఎండలో నిలబెట్టి సరుకులు పంపిణీ చేశారు
ప్రజల బాధలను కూటమి ప్రభుత్వం గుర్తించింది.. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తాం
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, జూన్ 1
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో నందిగామ పట్టణం నెహ్రు నగర్, నందిగామ మండలం అడవిరావులపాడు మరియు చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామాలలో రేషన్ ద్వారా నిత్యవసర వస్తువులను ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, గ్రామ సర్పంచ్, కూటమి నేతలు మరియు అధికారులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు.
ఉదయం 8-12, సాయంత్రం 4-8 గంటల వరకు రేషన్ షాపులు పని చేస్తాయని చెప్పారు. ఈ 15 రోజుల్లో అవకాశం ఉన్న సమయాల్లో రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించామని తెలిపారు. అలాగే 65 యేళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తంగిరాల సౌమ్య గారు వివరించారు.
అలాగే లబ్దిదారులు.. ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడికే వెళ్లి నిత్యవసర వస్తువులను తీసుకోనవసరం లేదు. సమీపంలోని రేషన్ షాపుల్లో సైతం వాటిని తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతో కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. అంతేకాకుండా.. ప్రజలు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారని, దీంతో కూటమి ప్రభుత్వం ఈ విధానం వైపు మొగ్గు చూపిందన్నారు. ఈ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక ఈ రేషన్ వద్దనుకునే లబ్ధిదారులకు నగదు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తంగిరాల సౌమ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.