logo

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు..!!!

AIMA MEDIA :జూన్ 1:ఆదివారం :విశాఖపట్నం
న్యూస్ 9:- రాష్ట్రము లో పోలీస్ రిక్యూర్ట్మెంట్ బోర్డు నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్షలు జూన్ 1వ తేది, ఆదివారం వివిధ సెంటర్స్ లో ప్రశాంతంగా జరిగాయి అని పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు.. వివరాలు లోకి వెళ్తే
విశాఖపట్నం సిటీ,
తేదీ: 01-06-2025.

*ప్రశాంతముగా ముగిసిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు*

*కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పరిశీలించిన నగర పోలీసు ఉన్నతాధికారులు*

మొత్తం 12,491 గాను మంది అభ్యర్ధులకు గాను 11,338 మంది అభ్యర్ధులు హాజరు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జూన్ 01 వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్ (సివిల్,ఎపిఎస్పీ) అభ్యర్ధులకు నిర్వహించిన పరీక్షలలో నగరంలో 27 పరీక్షా కేంద్రాలలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించడం జరిగినది.

ఈ సంధర్బంగా నగర ఇంచార్జి పోలీసు కమీషనర్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్., గారు, డి.సి.పి-01(ఎల్& ఓ) అజితా వేజెండ్ల, ఐ.పి.ఎస్., గారు , డి.సి.పి-02(ఎల్& ఓ) డి.మేరి ప్రశాంతి,ఐ.పీ.ఎస్., గారు, డి.సి.పి(అడ్మిన్)శ్రీ కృష్ణ కాంత్ పటేల్,ఐ.పీ.ఎస్., గారు పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.



22
205 views