
ప్రశాంతంగా జరిగిన పోలీస్ కానిస్టేబుల్మె యిన్స్ పరీక్షలు..!!
AIMA MEDIA :JUNE 1:SUNDAY :VISAKHAPATNAM
న్యూస్ 9:- రాష్ట్రము లో పోలీసులు మెయిన్స్ పరీక్షలు జూన్ 1వ తేది ఆదివారం వివిధ సెంటర్స్ లో జరిగాయి అని విశాఖపట్నం నగర పోలీస్ ఉన్నంత అధికారులు తెలిపారు.. వివరాలు లోకి వెళ్తే పత్రికా ప్రకటన
విశాఖపట్నం సిటీ,
తేదీ: 01-06-2025.
*ప్రశాంతముగా ముగిసిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు*
*కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పరిశీలించిన నగర పోలీసు ఉన్నతాధికారులు*
మొత్తం 12,491 గాను మంది అభ్యర్ధులకు గాను 11,338 మంది అభ్యర్ధులు హాజరు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జూన్ 01 వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్ (సివిల్,ఎపిఎస్పీ) అభ్యర్ధులకు నిర్వహించిన పరీక్షలలో నగరంలో 27 పరీక్షా కేంద్రాలలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించడం జరిగినది.
ఈ సంధర్బంగా నగర ఇంచార్జి పోలీసు కమీషనర్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్., గారు, డి.సి.పి-01(ఎల్& ఓ) అజితా వేజెండ్ల, ఐ.పి.ఎస్., గారు , డి.సి.పి-02(ఎల్& ఓ) డి.మేరి ప్రశాంతి,ఐ.పీ.ఎస్., గారు, డి.సి.పి(అడ్మిన్)శ్రీ కృష్ణ కాంత్ పటేల్,ఐ.పీ.ఎస్., గారు పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.