logo

కొమరవోలు ఆవ పూడికతీత పనులు ప్రారంభం

రోలుగుంట మండలం కొమరోలు గ్రామంలో కొమరోలు ఆవు మొదలుకొని పల్లపు కాలువ మోదవరకు సుమారు 2,72,002 నిధులతో ఉపాధి హామీ పథకం పథకం కార్యక్రమాన్ని ఆదివారం చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కొమరవోలు ఆవ నీటి సంఘం అధ్యక్షులు పోతల శ్రీను ,రైతులు పాల్గొన్నారు. అనంతరం కొమరోలు గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డిపో పునః ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించి నిత్యవసర వస్తువులను వినియోగదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపో వద్ద నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు సేవలను వినియోగించుకోవాలని కోరారు . రేషన్ డీలర్లు వినియోగదారులు కరోనా నియంత్రణ పద్ధతులు పాటిస్తూ, మాస్కులు ధరించి సరుకులు పొందవలసిందిగా కోరారు. వికలాంగులు, వృద్ధులకు సరుకులు ఇంటి వద్దకే అందజేయబడతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు చంద్రమౌళి, తాసిల్దార్ నాగమ్మ, డిప్యూటీ తాసిల్దార్ శంకర్, కొమరవోలుసర్పంచ్ చెల్లమనాయుడు, రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, శరభవరం సర్పంచ్ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు

23
826 views