ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యవసర సరుకులు అందించబడును .తాసిల్దార్ నాగమ్మ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రేషన్ డిపోల పునః ప్రారంభ కార్యక్రమాన్ని తాసిల్దార్ నాగమ్మ ప్రారంభించారు. తాసిల్దార్ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. తాసిల్దార్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి నిత్యవసర వస్తువులు రేషన్ డిపో వద్ద అందుబాటులో ఉంటాయని ప్రతినెల ఒకటో తారీకు నుంచి 15వ తారీఖు వరకు వినియోగదారులు సేవలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే వికలాంగులు మరియు వృద్ధులు నిత్యవసర సరుకులు వారి వద్దకే అందించబడతాయన్నారు. బయోమెట్రిక్ పడని వారివి రెవెన్యూ అధికారులు యొక్క అదేంటికేషనుతో సరుకులు అందించబడతాయి అన్నారు. నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే డీలర్స్ మరియు తీసుకునే వినియోగదారులు కరోనా నియమ నిబంధనలు పాటించాలని మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు