logo

మహానాడులో పాల్గొన్న రోలుగుంట మండలం నాయకులు, కార్యకర్తలు

అనకాపల్లి జిల్లా రోరగుంట మండలం నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ,ఎంతో ఆనందంగా ఉందని, ఈ ఉత్సాహంతో మండలంలో తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించి పార్టీని ప్రజల్లో ముందుకు తీసుకు వెళతామని మండల పార్టీ అధ్యక్షులు గుమ్ములూరు చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, రోలుగుంట ప్రచార కార్యకర్త సురేష్ కుమార్, కొవ్వూరు మాజీ సర్పంచ్ కొలిపల్లి ఈశ్వరరావు, కొండపాలెం సర్పంచ్ బంటు చిరంజీవి, శరభవరం సర్పంచ్ పంచాడచందర్రావు, మండల ఐటీడీపీ ఇన్చార్జ్ బంటు రాజు, నిండు కొండ ఎంపీటీసీ బాబులు మరియు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

18
2990 views