logo

అనాధ, నిరాశ్రయ బాల బాలికల సుచీను తెలపండి - జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క అధ్యక్షులు చిన్నంశెట్టి రాజు

ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ, విశాఖపట్నం అధ్యక్షులు చిన్నంశెట్టి రాజు సూచనల మేరకు విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉన్న అన్ని మండలాలలో మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అనాధ మరియు నిరాశ్రయ బాలలను సర్వే ద్వారా గుర్తించడం మరియు వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం 25-5-2025 వ తేదీ నుండి 25-6-2025 వ తేదీ వరకు అన్ని గ్రామాలూ మున్సిపల్ పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్స్, ఆశా వర్కర్స్, ANM లు, విద్యశాఖ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, మరియు NGO లు ద్వారా గుర్తించి, ఆధార్ కార్డులు ఆయా మండల కేంద్రాల లో ఆయా మండలాల తహసీల్దార్ వారి పర్యవేక్షణలో ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఈ అనాధ మరియు నిరాశ్రయ బాలలకు అర్హత ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర వెల్ఫేర్ స్కీంలు కూడా ఇప్పించడం జరుగుతుంది అని తెలియజేసారు. అదేవిధంగా మీ ప్రాంతాల లో ఉన్న అనాధ మరియు నిరాశ్రయ బాల బాలికల యొక్క సమాచారం పైన తెలిపిన ఎదో ఒక శాఖ సిబ్బందికి తెలియజేయవలిసింది గా మరియు ఆ బాలల యొక్క అభివృద్ధికి పాటు పడవలసిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క అధ్యక్షులు చిన్నంశెట్టి రాజు మరియు కార్యదర్శి R. సన్యాసి నాయుడు పత్రిక ప్రకటన లో తెలియజేశారు.

22
5935 views