ఆధ్వాన్నం గా మారిన కుశాయిగూడ సాయనగర్ కాలనీ పరిస్థితి
కుశాయిగూడ : హైదరాబాద్ శివారు లో ఉన్న కుశాయిగూడ లో సాయి నగర్ కాలనీ పరిస్థితి వర్షం పడితే చాలా అధ్వాన్నం గా తయారయింది. గతం లో రెండు సార్లు రోడ్ తవ్వి గొట్టాలు మార్చారు. కాని ఫలితం లేదు. మళ్ళీ ఇప్పటి కాలనీ ప్రెసిడెంట్ అయిన శ్రీ వినోద్ , సెక్రటరీ అయిన శ్రీ అచ్చయ్య చొరవ తో మరొక్కసారి 2024 లో పైప్ లైన్స్ మార్చడం జరిగింది. కాని కాంట్రాక్టర్స్ మళ్ళీ మోసం చేశారు. ఇప్పటికి వర్షం పడితే నాలాలు ఉప్పొంగి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది అని స్థానికులు వాపోయారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్న ఫలితం ఉండడం లేదు అని స్థానికులు వాపోతున్నారు.
ఇప్పటికన్నా అధికారులు స్పందించి కుశాయిగూడ సాయినగర్ కాలనీ నాలా ఉప్పొంగ కుండా ఉండేందుకు చొరవ చూపాలని
ఆశిద్దాం 🙏