logo

ట్రాక్టర్ దొంగతనం చేసిన ముద్దాయిలు అరెస్ట్

ఈ నెల 16 వ తేది అర్దరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో తుమ్మలవారిపల్లి కి చెందిన బాలకృష్ణ నాయుడు తన ట్రాక్టర్ మరియు ట్రాలీ నీ గ్రానైట్ క్వారీ లో పని ముగించుకొని vellore - chittoor రోడ్ ప్రక్కన క్రిష్ణ గ్రానైట్ ఫ్యాక్టరీ కి ఎదురుగా పార్కింగ్ చేసి ఉండగా , గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్ ను ట్రాలీ తో సహా దొంగలించినారని పిర్యాదు చేయగా, అతను ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడమైనది. దర్యాప్తు లో భాగంగా గ్రానైట్ ఫ్యాక్టరీ ముందు ఉన్న CC TV camera putuge ల ఆధారంగా దొంగలించబడిన ట్రాక్టర్ చిత్తూర్ మీదుగా కలికిరి వైపుగా వెళ్లినట్లు గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానం తో ముద్దాయిలను ఐడెంటిఫై చేసి ఈ రోజు మధ్యానం వారిని చీలపల్లి cross లో వారిని అరెస్ట్ చేయడమైనది. వారిని విచారించగా A1). C అవినాష్ రెడ్డి, వయస్సు 31 ఏళ్లు తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, కురుప్పల్లి H/o పారపట్ల, కలికిరి మండలం, ఇతనిపై గతంలో కలికిరి పోలీస్ స్టేషన్ లో చైన్ స్నాచింగ్ కేసు కలదు. A 2 . C నితీష్ కుమార్ రెడ్డి, వయస్సు 19 ఏళ్లు తండ్రి లేట్ c అన్నారెడ్డి, పారపట్ల విలేజ్, కలికిరి మండలం మరొక వ్యక్తి మైనర్ బాలుడు. మైనర్ బాలుడిపై మన జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సుమారుగా 15 మోటార్ సైకిల్స్ దొంగతనం కేసులు ఉన్నవి. వీరు ముగ్గురు ట్రాక్టర్ ను తమిళనాడు లో అమ్మడానికి అని ట్రాక్టర్ మీద ఉన్న నెంబర్ ప్లేట్ తీసివేసి, ఎవరికి అనుమానం రాకుండా బ్లూ కలర్ పెయింట్ వేసి, ఎరుపు రంగు top తీసివేసి, Blue కలర్ top వేసుకొని తమిళనాడు లో అమ్మడానికి పోతుండగా ఈ దినం అనగా 28.05.2025 వ తేది వారిని అరెస్ట్ చేసి విచారించగా వారు దొంగతనం ను అంగీకరించినారు. వారిని విచారించగా అరెస్ట్ చేసి విచారించగా వారి వద్ద వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన 2 royal enfield, 2 Bajaj pulsur, 1 splender Plus, 1 Passion Pro Motor Cycles. Tractor విలువ 10,00,000/- , మోటార్ సైకిల్స్ విలువ 8,00,000/- మొత్తం 18,00,000/- విలువ గల వాహనాలను సీజ్ చేసి రిమాండ్కి పంపడమైనది.....

10
2314 views