logo

ధర్మవరం మహానేత ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ నడిబొడ్డున పిఆర్టి సర్కిల్ నందుగల మహానేత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి సీనియర్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ సీపీ నేత షేక్ అమీర్ భాష గారు పూలమాలవేసి నివాళులర్పించారు
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానేతగా ఎన్టీరామారావు చిరస్థాయిగా తెలుగు వాడి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని కొనియాడారు అలాగే పేదలు , రైతులు చేనేతలు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాని కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు వాడి గుండె చప్పుడు లో ఒకటయ్యాడని ప్రశంసించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుండి దించివేసి అనేక విధాలుగా అవమానించడం జరిగిందన్నారు. సొంత అల్లుడు తనను అవమానించడం ఎన్టీఆర్ భరించలేకపోయారన్నారు ఆయన ఆత్మశ్చోభకు గురై ఆ మహానేత తనువు చాలించారని వైయస్సార్సీపి నాయకులు షేక్ అమీర్ భాష తెలిపారు.

32
2868 views