logo

ఫ్రెండ్స్ అసోసి యేషన్ దుగ్గిరాల పొగాకు వ్యతిరేకదినోత్సవం అవగాహనపై గోడపత్రిక ఆవిష్కరణ.

తేది: 28-05-2025,ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు జరిగే అనర్థాలను తెలియజేసే గోడ పత్రిక (స్టిక్కర్) ను స్థానిక శివాలయం సెంటర్ లో ఆవిష్కరింపజేశారు. తదనంతరం అతిథులు మాట్లాడుతూ 31 మే 1988 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థవారు 'ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరపు నినాదం 'అప్పీలును బహిర్గతం చేయడం : పొగాకు పరిశ్రమ వ్యూహాలను బహిర్గతం చేయడం'. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పొగాకు, మరియు పొగాకు ఉత్పత్తుల వలన ప్రజలకు, ప్రజారోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన పెంచడమే* " అని అన్నారు. " *పొగాకు, మరియు పొగాకు ఉత్పత్తులను సేవించడం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని WHO నివేదికలు తెలియజేస్తున్నాయి"* అని అన్నారు. " *ముఖ్యంగా యువత ధూమపానానికి బాగా ఆకర్షితులవుతున్నారు. పొగ త్రాగడం వలన ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదరకోశ క్యాన్సర్ తో పాటు క్షయ, దంత క్షయం, అల్సరు, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి"* అని అన్నారు. " *పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం వలన రక్తపోటు, పక్షపాతము, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు తమ నివేదికల ద్వారా హెచ్చరిస్తున్నారు"* అని అన్నారు. " *భారతదేశంలో స్మోకింగ్ కారణంగా యేట 13.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. పొగాకు, పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, సిగారు, గుట్కా, పాన్ పరాగ్, హుక్కా, బీడీ, నశ్యము, మొదలైన వాటిని అనేక రూపాలలో వినియోగిస్తున్నారు. నములటం, పీల్చటం లాంటి మొదలైన పద్ధతులలో వీటిని ఉపయోగించే వారితో పాటు వారి ప్రక్కన ఉండి పొగ పీల్చే వారు కూడ పైన ఉదహరించిన రోగాలబారిని పడతారని వైద్యులు చెబుతున్నారు. దీనినే సెకండ్ హ్యాండు స్మోకింగ్ అంటారు. ఈ సెకండ్ హ్యాండు స్మోకింగ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంది. ఒక సిగరెట్ కనుక త్రాగితే మనిషియొక్క జీవితకాలంలో 20 నిమిషాల ఆయుష్షు తగ్గినట్టే. ఈ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఆరోగ్యం క్షీణించడం, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చివరకు ప్రాణనష్టము కూడా జరుగుతుంది. ఆరోగ్యమే మహా భాగ్యము కావున ఈ పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మన చేతులలో ఉంటుంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం మరియు ఎగుమతులలో చైనా మరియు ఇండియా ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉంటే బ్రెజిల్, జింబాబ్వే ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటకలలో పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి యోగా, ధ్యానం మొదలైన మంచి అలవాట్లతో పాటు పౌష్టికాహారం తీసుకుని మంచి జీవనంతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి" అని అన్నారు.
"పొగాకు సేవించే వారు వాటిని మానాలంటే పొగ త్రాగాలనిపించినప్పుడు ఆరోగ్యకరమైన చిరు తిండ్లను తినడం ద్వారా, నారింజ, బత్తాయి, ద్రాక్ష మొదలైన పండ్లు తినడం లేదా రసాలను త్రాగడం, చ్యూయింగ్ గమ్ నమలడం, చ్యాక్లెట్లను తినడం ద్వారా, పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీరు త్రాగడం ద్వారా, పచ్చి కూరగాయలు తినడం ద్వారా, మంచినీరు ఎక్కువగా త్రాగడం ద్వారా, దాల్చిన చక్క, లవంగాలు, యాలకులు నమలడం ద్వారా, గోరువెచ్చని పాలు త్రాగడం ద్వారా, నిమ్మకాయ నీరు త్రాగడం ద్వారా ఆ అలవాట్లను మానవచ్చు"* అని తెలిపారు. " *దీనికి సంకల్ప బలం ఉంటే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు* " అని తెలిపారు. " *కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి"* అని కోరారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు మిక్కిలినేని గాంధీ(దోస్తు), జెట్టి బాలరాజు, జాగృతి భారత ట్రస్ట్ అధ్యక్షుడు పసుపులేటి గణేష్, చుండూరు ఉమా మహేశ్వర రావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కుర్రా నాగయ్య, జానీ, షేక్ శుభాని,కరిముల్లా, తాడిబోయిన శ్రీధర్ బాబు, గండు పాములు, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లయ్య, వెంకట సుబ్బారావు ఎర్రమాసు ముత్యం తదితరులు పాల్గొన్నారు.

60
2717 views