logo

ఆర్టిఐ యాక్టివిస్ట్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవంలో జ్ఞాని జైల్ సింగ్ జాతీయ అవార్డు గ్రహీత మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెల

విజయవాడ హోటల్ గోల్డెన్ వే లో శనివారం సమాచార హక్కు చట్టం 2005 కి సంబంధించి ఆర్టిఐ యాక్టివిస్ట్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవం అసోసియేషన్ అధ్యక్షులు ముత్తు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి కి చెందిన జ్ఞాని జైల్ సింగ్ జాతీయ అవార్డు గ్రహీత మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆర్టిఐ ఆక్టివిస్ట్స్ అసోసియేషన్ ఆర్టిఐ జీవితకాల సభ్యుడు కొమ్మోజు రమేష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం (RTI) అనేది ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే పౌరుల చట్టపరమైన హక్కును సూచిస్తుందని అన్నారు. భారతదేశంలో, ఈ హక్కును సంస్థాగతీకరించడానికి RTI చట్టం, 2005 అమలు చేయబడిందని, పౌరులు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని అభ్యర్థించవచ్చు అని అన్నారు అదేవిధంగా ప్రజా రికార్డులను తనిఖీ చేసుకునే వీలును కూడా చట్టం కల్పించిందని తెలియజేశారు తదనంతరం సమాచారం కోసం ఏ విధంగా అధికారుల్ని అడగాలి అనే విషయంపై సెక్షన్ 6(3), సెక్షన్ 19(1), సెక్షన్ 19(3),సెక్షన్ 18(1) దరఖాస్తులను ఏ విధంగా రాయాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆర్టిఐ కార్యకర్తల పైన దాడులు జరిగినప్పుడు దాన్ని సంయుక్తంగా ఎదుర్కోవడానికి సంబంధించి అసోసియేషన్ నుండి ఒక యాక్షన్ కమిటీ వెయ్యాలని అసోసియేషన్ అధ్యక్షులు జి ముత్తు మరియు ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమారి మరియు అసోసియేషన్ సభ్యులను అభ్యర్థించారు. తదనంతరం రమేష్ ను మెమెంటో మరియు దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం మొదలగు జిల్లాలనుండి మరియు తెలంగాణ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో ఆర్టిఏ కార్యకర్తలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సమాచార హక్కు చట్టం కర దీపికను పుస్తకాన్ని అసోసియేషన్ అధ్యక్షులు ముత్తు అందజేశారు.

6
849 views