logo

నవధాన్యాలు సాగు నేలతల్లి బాగుపై అవగాహన సదస్సు

విజయనగరం జిల్లా.రాజాం.

రాజాం డివిజన్లో రాజాం మండలంలో గార్రాజుచీపురుపల్లి యూనిట్ లో ముద్దడాజోగివలస గ్రామంలో నవధాన్యాల సాగు నేలతల్లి బాగు
నవధాన్యాలు సాగుపై విస్తృత కార్యక్రమం నిర్వహించారు 25 రకాలు విత్తనాలతో 12 కేజీలు ఒక కిట్టు తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవధాన్యాలు యొక్క ఉపయోగాలు అవగాహన కల్పించారు అలాగే ప్రతి ఒక్క రైతు ఒక ఎకరానికి 18 నుండి 30 రకాల విత్తనాలతో 10 నుండి 12 కేజీలు నవధాన్యాలు వేసుకోవాలని రైతులకు సూచించారు అనంతరం ప్రతి ఒక్కరు ఈ రకం విత్తనం ప్రాముఖ్యత గురించి వాటి ఉపయోగాలు గురించి భూమాత ఆరోగ్యం గురించి నేలలు సారవంతం గురించి రైతులతో అధికారులతో సంభాషించారు రైతులకు నవధాన్యాలు విత్తనాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎన్ఎఫ్ఏ రేఖ,యూనిట్ ఇంచార్జ్ బి.రమాదేవి , క్రిష్ణా మోహన్, నాగమణి,ఐసిఆర్పి శ్రావణి తదితరులు రైతులు సమక్షంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

52
1673 views