
హైదరాబాద్ అగాఖాన్ అకాడమీలో కుమారుడి స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలలో తండ్రి మోహన్ రెడ్డితో కలసి పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి*
*హైదరాబాద్ అగాఖాన్ అకాడమీలో కుమారుడి స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలలో తండ్రి మోహన్ రెడ్డితో కలసి పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి*
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కుమారుడు గడికోట రిత్విక్ రెడ్డి హైదరాబాద్ లోని అగాఖాన్ అకాడమీలో 12 వ తరగతిని పూర్తి చేశారు. అగాఖాన్ అకాడమీలో ఘనంగా నిర్వహించిన స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలలో తన తండ్రి ,మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి మరియు కుటుంభ సభ్యులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్య క్రమానికి ఇతర దేశాల యూనివర్సిటీ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ యూనివర్సిటీల SAT (సాట్) పరీక్షలలో అతున్నతమైన మార్కులను రిత్విక్ సాధించారు. అమెరికా దేశంలోని బ్యాట్స్ కాలేజీ, కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ,స్టోనీ బ్రూక్స్ యూనివర్సిటీ, ఇల్లినోయిస్ యూనివర్సిటీ, విస్కన్సిస్ యూనివర్సిటీ, జిడబ్యు యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్,యూనివర్సిటీ ఆఫ్ మియామీ,నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ లలో ఇతనికి Pre Medicine సీటు అవకాశం కల్గింది.సదరు యూనివర్సిటీ లలోని ఓ యూనివర్సిటీలో ఆగస్టు మాసంలో రిత్విక్ చేరనున్నారు.