logo

ఇండియన్ ఆర్మీ కి SRIT కళాశాల నుండి రూ.10 లక్షల విరాళం

యస్.టి.డి. న్యూస్: దేశ రక్షణ కోసం నిరంతరం ప్రాణాలను తృణప్రాయంగా భావించి సేవలందిస్తున్న భారత సైనికుల పట్ల కృతజ్ఞతగా, అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SRIT) తరఫున 10 లక్షలు రూ.లు విరాళాన్ని భారత సైన్యానికి అందజేశారు. ఈ విరాళం ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులు ప్రదర్శించిన సాహసానికి, త్యాగానికి గుర్తింపుగా అందిస్తున్నామని తెలుపుతూ SRIT కళాశాల ఛైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి (మాజీ ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ డాక్టర్ ఎం. రంజిత్ రెడ్డి కలిసి, ఈ విరాళాన్ని హైదరాబాద్‌లోని తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియాకు చెందిన ప్రముఖ సైనికాధికారులు బ్రిగేడియర్ నంజుందేశ్వర ఎన్.వి., కర్ణల్ వి. సురేష్ గౌడ్ సమక్షంలో అందజేశారు.

10
412 views