
నగరిలో శ్రీకృష్ణదేవరాయ బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం...
21మే 25 బుధవారం : నగరిలో శ్రీకృష్ణదేవరాయ బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం*
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో బైపాస్ రోడ్ లో ఉన్న ఎస్పీజీ ఫంక్షన్ హాల్ లో ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జాతీయ కాపు సంఘం సభ్యులందరూ సమావేశమయ్యారు,జ్యోతిని వెలిగించి ,శ్రీ కృష్ణాదేవరాయల చిత్రపటానికి పుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమం నగరి నియోజకవర్గ జాతీయ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంవి బాబు జన్మదిన కూడా ఈరోజే కావడం విశేషం ముందుగా ఎం వి బాబు ప్రసంగిస్తూ కాపు సామాజిక వర్గం అంతా ఒక వేదిక మీదకు రావడం మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉందని.... ఈఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గంలో నుంచి కాపు సామాజిక వర్గ కుటుంబ సభ్యులందరూ రావడం మరింత ఉత్సాహం తెచ్చిందని ఆయన అన్నారు.
కాపు అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని దానికి మనం ఏకతాటిపై నడచి ఐక్యమత్యంతో పనిచేయాలని జాతీయ బలిజసేవాసంఘ ప్రచార కార్యదర్శి గోపిరాయల్ స్పష్టం చేశారు. ఎం వి.బాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కాపు సంఘ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు. సెరిఫైడ్ మాజీ చైర్మన్ ఏఎం .రాధాకృష్ణ మాట్లాడుతూ మన ఐక్యమత్యమే మన బలం కావాలన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేజేకుమార్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువకావాలన్నారు. రాజకీయంగాను కాపు కులస్థులు ఎదగాలన్నారు. డాక్టర్ రామచంద్రన్ మాట్లాడుతూ సంఘం తరపున పేదపిల్లలకు అవరమైన అభ్యసనా సామగ్రి అందించడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కాపుసంఘ సలహాసభ్యులు జ్యోతినాయుడు మాట్లాడుతూ సేవాకార్యక్రమాలతోనే సంఘాలకు మనుగడ ఉంటుందని అందులో మనం ముందంజలో ఉండాలన్నారు. మాజీ కౌన్సిలర్ గుణశేఖర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాపుసంఘం విస్తరించాలన్నారు. డాక్టర్ భక్తవత్సలం మాట్లాడుతూ కాపులకు ఏ కష్టం వచ్చినా సంఘం అండగా నిలవాలన్నారు. కాగా సమావేశ ప్రారంభంలో కాపునేతలు పహల్గామ్ దాడిలో మృతిచెందిన భారతీయులకు, వీరజవాన్లకు మౌనంపాటిస్తూ నివాళులర్పించినారు. ఈ కార్యక్రమంలో కాపుసంఘం చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు విజయబాబు, జిల్లా అధ్యక్షులు శ్రీరామ్గోపి, నాయకులు కోదండయ్య, వెంకటేశులు, గోవిందయ్య, ఉమాపతి, విశ్రాంత రెవిన్యూ అధికారి కృష్ణమూర్తి, శ్రీనివాసా హాస్పిటల్ నిర్వాహకులు రవిబాబు, యువత నాయకులు ఎన్సీ శేఖర్, గాంధీ, మణిగండన్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.