విజయనగరం వచ్చిన APCC రాష్ట్ర కిసాన్ సెల్ ఛైర్మన్
విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి APCC రాష్ట్ర కిసాన్ సెల్ ఛైర్మన్ కామన్ ప్రభాకర్ రావు ఆదివారం వచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ... విజయనగరంలో పలు సమస్యలైన షుగర్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లులు, తోటపల్లి కాలువ ఇతర ప్రాజెక్టుల గురించి అతని దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాడి రైతు సమస్యలు తీర్చాలని కోరారు.