యువకుడిని ట్రాప్.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన ముగ్గురు దుండగులు
అమ్మాయి పేరుతో వాట్సాప్లో చాట్ చేసి యువకుడిని ట్రాప్.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన ముగ్గురు దుండగులు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడిని వాట్సాప్లో అమ్మాయి పేరుతో చాట్ చేసి కరీంనగర్కు రప్పించిన ముగ్గురు దుండగులు ఈ నెల 11న మంచిర్యాల నుండి కరీంనగర్కు వచ్చిన యువకుడిని, అమ్మాయి మనుషులం అంటూ రిసీవ్ చేసుకున్న సందీప్, ప్రణయ్, రెహాన్ అనే ముగ్గురు దుండగులు అనంతరం కరీంనగర్ శివారులోని వెలిచాల గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి, రూ. 50 వేలు డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు దుండగులు తన వద్ద ఉన్న రూ.10 వేలు ఇచ్చి, మరో రూ.12 వేలు ఫోన్ పే చేయించి.. వారి నుండి తప్పించుకొని పోలీసులకు తనపై జరిగిన దాడిని చెప్పిన యువకుడు రంగంలోకి దిగి సందీప్, ప్రణయ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న రెహాన్ కోసం గాలింపు చేస్తున్న పోలీసులు