
500గ్రాముల గంజాయి ,మోటార్ సైకిల్ స్వాదీనం...
16మే25 శుక్రవారం : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ లో గురువారం ఉదయం రాబడిన సమాచారం మేరకు నగరి ఇన్స్పెక్టర్ యన్. విక్రమ్ మరియు శేఖర్, గజేంద్ర, సత్య లతో పాటు, డిప్యూటీ తహశీల్దారు మేఘవర్ణం మరియు రెవెన్యూ సిబ్బంది తో పాటు, నగరి మండలం వెంగన్న కండ్రిగ వద్ద ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ లో నగరి టౌన్ నుండి నుండి పొదటూరు పేట వైపు గా వస్తూండగా, వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 500 గ్రాములు గంజాయి గుర్తించి, వారిని విచారించగా వారి లో ఒక వ్యక్తి యన్. ధనుష్, వయస్సు: 21 సం. తండ్రి: నరసింహన్, విలాసపురం కాలనీ, పొదటూరుపేట గాను, మిగిలిన ఇద్దరు జువెనైల్ గాను గుర్తించి, వారిని విచారించగా కరకంటాపురం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు మణికంఠ అనే వ్యక్తి దగ్గర తక్కువ డబ్బులకు కొనుక్కొని పొదటూరు పేట కి తీసుకొని వెళ్ళి ఎక్కువ డబ్బులకు అమ్మడం కోసం తీసుకొని వెళ్తున్నట్లు గుర్తించడమైనది. వారిని అడుపులోనికి తీసుకొని, వారి వద్ద నుండి సుమారు 500 గ్రాముల గంజాయి మరియు మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మణికంఠ కోసం గాలించడం జరుగుతున్నది.
తల్లి తండ్రులకు పోలీస్ వారి విన్నపం, చిన్న చిన్న వయస్సులో చదువుకుంటున్న పిల్లలు గంజాయి కి అలవాటు పడి, నేరాలలో పాల్గొని విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కావున తల్లితండ్రులు వారి పిల్లల కదలికల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి, గంజాయి బారిన పడకుండా చూసుకోవలసిందిగా కోరడమైనది. అదే విధంగా ప్రజలు గంజాయి గురించి సమాచారం పోలీస్ వారికి అందించి, గంజాయి నిర్మూలన లో పోలీస్ వారికి సహకరించ వలసిందిగా కోరడమైనది, మీ వివరాలు గోప్యం గా ఉంచడం జరుగుతుంది.