logo

నగరి పట్టణంలో నేత్ర పర్వంగా కంచి గరుడోత్సవం,గరుడవాహనంపై విహరించిన కరియమాణిక్య స్వామి...

13 మే 25 మంగళవారం : నేత్రపర్వంగా కంచి గరుడోత్సవం,గరుడవాహనంపై విహరించిన కరియమాణిక్య స్వామి...చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని శ్రీదేవి, భూదేవీ సమేత కరియమాణిక్యస్వామి ఆలయంలో నిర్వహించిన కంచి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా స్వామిని సుందరంగా అలంకరించి సువర్ణశోభిత గరుడవాహనంపై ఉంచారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సాగిన ఈ వేడుకలో స్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. మాడవీధులు గోవిందనామస్మరణతో మారుమోగాయి. గరుడవాహనంపై విహరిస్తూ చిద్విలాసంగా వచ్చే కరియమాణిక్యునికి స్వాగతం పలుకుతూ కళాకారులు మాడవీధుల్లో మంగళవాయిద్యాలు, భాజాభజంత్రీలు, కేరళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఆద్యంతం వేదపండితులు వేదమంత్రోచ్ఛరణ చేశారు. దేవ, దేవతల వేషధారణలో వచ్చిన చిన్నారులు తమ నృత్యాలతో అందరినీ అలరించారు. గరుడసేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మాడవీధులు కిటకిటలాడింది. ఊరేగింపుగా వచ్చిన కరియమాణిక్య స్వామికి భక్తులు కొబ్బరి కాయలు కొట్టి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్నమ్మ, ఏఈవో రవి, సూపరింటెండెంట్‌ శంకర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణ, సురేష్‌బాబు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్, మున్సిపల్‌ కమీషనర్‌ కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ధన్వంతరాచార్యులు, నరసింహ ప్రసాద్, ఆలయ అభివృద్ధి సలహా సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు,.... కంచి గరుడ సేవ ఊరేగింపు సందర్భంగా చావడి వద్ద చల్లటి మజ్జిగను నగరి నియోజకవర్గ జాతీయ కాపు సంఘం అధ్యక్షులు ఎంవి బాబు ఆధ్వర్యంలో వారి అనుచరులు సహకారంతో మజ్జిగ ను భక్తులకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎంవి బాబు మాట్లాడుతూ కంచి గరుడ సేవా సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదేవిధంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉందని ఆయన పేర్కొన్నారు....కంచి గరుడ సేవ గురించి తెలుసుకుందాం రండి...
గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి అనుంగు సేవకులు .శ్రీమహావిష్ణువు ఏ కార్యార్థమై తరలి వెళ్తున్నా , తన భుజస్కందాలమీద ఆయనని ఎక్కించుకుని రివ్వున ఎగిరి క్షణాల్లో గమ్యాన్ని చేర్చే శ్రీవారి వాహనం గరుత్మంతుడు. ఆ శ్రీహరి ఏ రూపంలో ఈ భూమిమీద ఉన్నా, ఆయా రూపాల్లోనూ స్వామివారికి వాహనంగా గరుత్మంతుడు దర్శనమిస్తుంటారు. రామాలయం, కృష్ణాలయం, నారసింహాలయం, వెంకటేశ్వర ఆలయం , పద్మనాభాలయం ఇలా శ్రీవారు పలురూపాల్లో ఎక్కడున్నా ఆ గరుత్మంతుడు వాహనమై వెంటే ఉంటారు . అలాగే కంచిలో వేంచేసి ఉన్న వరదరాజస్వామి వారి ఆలయంలోనూ ఒక భారీ గరుడవాహనం ఉంది. దీనికీ కంచి గరుడ సేవ అనే నానుడికి ఒక విడదీయలేని సంబంధముంది . ప్రస్తుతం ఒక జాతీయంగా మారిపోయిన ఈ మాట వెనుకున్న ఆసక్తికరమైన విషయం. తెలుసుకుందాం . వైనతేయుని పరాక్రమానికి తిరుగేలేదు . తన తల్లి దాస్య విముక్తి కోసం సురలోకం నుండీ అమృతాన్ని తీసుకొని వస్తుంటే ఇంద్రుడు అడ్డగించి ఆయనమీద బ్రహ్మాస్త ప్రయోగం చేశాడు . ఆ బ్రహ్మాస్త్రం గౌరవాన్ని తగ్గించకుండా ఉండడం కోసం తన రెక్కల్లోని ఒక ఈకని విదిల్చాడట ఆ గరుత్మంతుడు. అంతటి బలశాలి , ధీశాలి , పరాక్రమశాలి మన గరుడభగవానుడు. అందుకే నిద్రించేముందర వైనతేయుణ్ణి స్మరిస్తే , దుస్వప్నాలు రావు . తలచినంత మాత్రం చేత , స్వప్నములో కూడా రక్షణగా ఉన్నాడంటే, మెలకువగా ఉన్నప్పుడు కూడా స్మరిస్తే, ఇంకెంత రక్షణనిస్తాడో స్వామి . ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. భక్తులకే కాదు ఆ స్వామి దూతగా సులోకాధీశులందరికీ ప్రియమైనవాడు వైనతేయుడు. స్వామివారి కళ్యాణమైనా , బ్రహ్మోత్సవమైనా , యజ్ఞమైనా మరే శుభకార్యమైనా గరుడధ్వజమై దేవీదేవతలకి ఆహ్వానం ఇచ్చేది ఈ గరుత్మంతుడేకదా!గరుడవాహనంపైన స్వామి ఊరేగుతుంటే ఉండే శోభే వేరు . తిరుమల కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడవాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు.అయితే ‘కంచి గరుడ సేవ’ అన్న జాతీయం రావడం వెనుకమాత్రం ఆసక్తికర విషయం ఒకటుంది . 108 దివ్యదేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు శ్రీ వరదరాజ పెరుమాళ్‌గా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడసేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను మెరిపించాలంటేనే బోలెడంత శ్రమ చేయాలి . ఇక అంత భారీ గరుడ మూర్తిని శుభ్రం చేసి, స్వామివారి సేవకి సిద్ధం చేయాలంటే, సామాన్యమైన శ్రమ సరిపోదు. ఈ క్రమంలో అయ్యవార్లు అలిసిపోతుంటారు.గరుత్మంతుడు గొప్పవారే . కానీ అక్కడ ఉన్న పెరుమాళ్ళు ఆయనకంటే గొప్పవారు కదా ! పైగా ఈయన కేవలం వాహనం . ఆయన పెరుమాళ్ళు . వరాలు అనుగ్రహించే వరదరాజు . “ఈ గరుడమూర్తిని తోమి తోమి శ్రమపడి శుభ్రం చేసేకంటే, స్వామి వారికి మరింత సేవ చేస్తే మనకెంతో పుణ్యం కదా! అనుగ్రహించి పెరుమాళ్ళు వరాలని అనుగ్రహిస్తాడుకాదా ! ఈ గరుడ వాహనాన్ని యెంత తోమినా ప్రయోజనం ఏముంది ?” అని ఆ గరుడవాహనాన్ని శుభ్రం చేసేవారు వాపోతుంటారట.రిపోర్టర్ : యస్ సెందిల్ కుమార్ ,నగరి 8919607089

21
1933 views