పవర్ ఆఫ్ ఆర్టీఐ సాయికుమార్ కు మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ "జ్ఞాని జైల్ సింగ్ అవార్డు
మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ "జ్ఞాని జైల్ సింగ్ స్మారక పురస్కారం"ను గుంటూరు కు చెందిన జర్నలిస్ట్ & ఎడిటర్ & పబ్లిషర్ పట్నాల సాయికుమార్ కు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నందు తేది11 మే 2025 న అందుకున్నారు.వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మరియు ఏపీజెయు 5 వసంతాల వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు) మరియు శ్రీ గోసంరక్షణ సమితి ,వినోద్ ఫౌండేషన్,ఆధరణ చారిటబుల్ ట్రస్ట్ వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్త నిర్వహణలో భారతదేశంలో మొదటిసారిగా జాతీయస్థాయి పురస్కారాల బహుకరణ కార్యక్రమం చేపట్టారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం.డి షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని సీనియర్ జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తూ పవర్ ఆఫ్ ఆర్టీఐ మాసపత్రిక ను నిర్వహిస్తు
సామాజిక సేవా కార్యక్రమంలో సేవలు అందిస్తున్నందుకు పవర్ ఆఫ్ ఆర్టీఐ సాయికుమార్ ను జ్ఞాని జైల్ సింగ్ అవార్డు అందజేసి సత్కరించారు