logo

పవర్ ఆఫ్ ఆర్టీఐ కొమ్మోజు రమేష్ కు మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ "జ్ఞాని జైల్ సింగ్ అవార్డు

మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ "జ్ఞాని జైల్ సింగ్ జాతీయ స్దాయి స్మారక పురస్కారం"ను అనకాపల్లి కు చెందిన జర్నలిస్ట్ & చీఫ్ ఎడిటర్ కు సమాచార హక్కు చట్టం విభాగం లో కొమ్మోజు రమేష్ కు ఆదివారం రాత్రి తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నందు తేది11 మే 2025 న అందుకున్నారు.వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మరియు ఏపీజెయు 5 వసంతాల వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు) మరియు శ్రీ గోసంరక్షణ సమితి ,వినోద్ ఫౌండేషన్,ఆధరణ చారిటబుల్ ట్రస్ట్ వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్త నిర్వహణలో భారతదేశంలో మొదటిసారిగా జాతీయస్థాయి పురస్కారాల బహుకరణ కార్యక్రమం చేపట్టారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం.డి షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తూన్న పవర్ ఆఫ్ ఆర్టీఐ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ కి
సామాజిక సేవా కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం విభాగం లో సేవలు అందిస్తున్నందుకు పవర్ ఆఫ్ ఆర్టీఐ కొమ్మోజు రమేష్ ను జ్ఞాని జైల్ సింగ్ అవార్డు అందజేసి సత్కరించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ
ఈ అవార్డు, గౌరవ సత్కారం నూతన ఉత్సాహాన్ని నింపింది.మరింత బాధ్యత పెరిగింది, భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రేరణ గా నిలుస్తుందని భావిస్తున్నాను అదేవిదంగా
శుభాకాంక్షలు తెలియజేసిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

24
2537 views