
*సమాజ సేవకురాలు సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి సేవలు చిరస్మరణీయం*
*భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి
12-05-2025
బేతంచర్ల
*మే 12 సమాజ సేవకురాలు సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్బంగా*మరియు *పిసి పీఎన్డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై, కాలుష్యం పై ప్రజలకు అవగాహణ సదస్సు*
బేతంచర్ల పట్టణంలోని అల్లాబకాష్ దర్గా సమీపంలో ఉన్న అర్బన్ హేల్త్ సెంటర్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో బేతంచేర్ల అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. బి. ప్రియాంక అద్యక్షతన ఏర్పాటు చేసిన
సమాజ సేవకురాలు సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాజశేఖర్, చైతన్య, శైలజ,
బాల శేషయ్య, సుజాత, సుధారాణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై.బి. ప్రియాంక,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి,నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్ర
మాట్లాడుతూ
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు*
ఫ్లోరెన్స్ నైటింగేల్ మే 12 , 1820 న జన్మించారు. ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యము. లేడి విత్ ది లాంప్ గా పేరెన్నికగన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవల వలన యుద్ధంలో దెబ్బ తిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురించేది. ఎంతో గొప్పింటి ఐన ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నది .ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది.ప్రతి ఒక్క సిస్టర్ ఫ్లారెన్స్ ను అదర్శంగా తీసుకుని సేవలందించాలని కోరారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1910 ఆగస్ట్ 13 స్వర్గస్తులైనారు.
ఇలాంటి మహానీయురాలిని ఎల్లవేళల స్మరించుకుంటు వారి అడుగుజాడలలో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక ,
నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులుఈ సి. నాగసురేంద్ర కోరారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు మరణించిన అమె సేవ కలకాలం జీవించి ఉంటుంది.
*భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి*
*పిసి పీఎన్డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై ప్రజలకు బేతంచర్ల అర్బన్ హెల్త్ సెంటర్నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై.బి. ప్రియాంక,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి లు అవగాహణ కల్పించారు. వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మన దేశం లో గణాంకాలు పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు వల్ల దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్ల ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్నా కారణంగా ఇలాంటి హత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పై పూర్తిస్థాయిలో అవగాహనతో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై సమాచారం అందించడానికి సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఈ చట్ట అమలుకు సహకరించాలని అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై.బి. ప్రియాంక,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని అన్నారు. ఆడబిడ్డలను పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం బేతంచర్ల అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై.బి. ప్రియాంక,
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. అలాగే ప్రజలకు ఆరోగ్యం పై అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని ,నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలి. క్రమం తప్పకుండా సరైన సమయానికి టీకాలు వేయించాలి. చిన్నప్పుడు నుంచే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బేతంచర్ల ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్ లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై.బి. ప్రియాంక, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్రలు తెలిపారు.